News February 10, 2025
విజయవాడ: ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

నులి పురుగులు పిల్లలలో రక్తహీనత, పోషక లోపాలకు కారణమవుతాయని, అందుకే అందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడ గవర్నర్పేటలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు.
Similar News
News February 19, 2026
బాపట్ల తీరానికి ‘గోవా’ కళ

బాపట్ల తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు గోవాలో పర్యటించనుంది. తీర ప్రాంత నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి, బాపట్ల తీరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ బృందం 22న తిరిగి విజయవాడకు చేరుకోనుంది.
News February 19, 2026
ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.
News February 19, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


