News August 11, 2025

విజయవాడ: కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం.. జిమ్ కోచ్‌గా గుర్తింపు

image

సింగ్ నగర్‌లోని ఓ ఇంట్లో జిమ్ కోచ్ రవిచంద్ర (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. నాలుగైదు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 9, 2026

బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

image

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.

News March 9, 2026

కాకినాడ: కొండల్లో రక్తపుమడుగులో బాలుడి మృతదేహం

image

అనకాపల్లి(D) ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపుమడుగులో <<19331621>>బాలుడు కౌసిక్ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. CI ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తోటి బాలురను విచారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతిచెందడం గమనార్హం.

News March 9, 2026

పెంట్లవెల్లి మండలంలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలంలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తాడూర్ మండలంలో 38.3°C, కల్వకుర్తి మండలంలో 38.1°C, తిమ్మాజిపేట మండలంలో 37.6°C, అచ్చంపేట మండలంలో 37.4°C, ఊర్కొండ మండలంలో 37.2, పెద్దకొత్తపల్లి 37.1°C, వెల్దండ 36.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ప్రజలు ఎండతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.