News February 6, 2025
విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు

ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి.
Similar News
News January 18, 2026
బాబాయ్ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News January 18, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News January 18, 2026
VJA: మైనర్తో గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

వైసీపీ అధినేత జగన్పై గతంలో గులకరాయి దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్నగర్కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.


