News April 20, 2024

విజయవాడ: పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలు

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 21న ఆదివారం హంటింగ్ టైగర్స్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14 బాలుర ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలో ఆసక్తిగలవారు ఎవరైనా జట్టుగా వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. ఈ పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు.

Similar News

News December 13, 2025

గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 13, 2025

21న మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు స్పెషల్ ట్రైన్

image

అజ్మీర్ ఉరుసు ఉత్సవాలకు వెళ్లేందుకు గాను ఈ నెల 21వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు ప్రత్యేక ట్రైన్‌ను వేసినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. 28వ తేదీ అజ్మీర్ నుంచి బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు తిరిగి మచిలీపట్నం చేరుకుంటుందని చెప్పారు.

News December 12, 2025

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.