News April 2, 2024
విజయవాడ: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News February 11, 2026
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.
News February 11, 2026
కృష్ణా: కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖ.. కార్యకర్తల ఆందోళన!

మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రలకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు ముప్పు పొంచి ఉందన్న వార్తతో మచిలీపట్నం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రకు ఇటువంటి హెచ్చరికలు రావడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు.
News February 11, 2026
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు – కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనల ప్రకారం తొలి విడతలో 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఈనెల 24న జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు. అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.


