News July 8, 2024

విజ‌య‌వాడ‌: ముగిసిన UPSC EPFO, ESICప‌రీక్ష‌లు

image

విజ‌య‌వాడ‌లో ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన EPFO ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ESIC న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. EPFO ప‌రీక్ష‌కు సంబంధించి 2,401 మందికి, ESIC ప‌రీక్ష‌కు 5,433 మంది అభ్య‌ర్థులకు విజయవాడలో ఏర్పాటు చేసిన 25 ప‌రీక్షా కేంద్రాలను క‌లెక్ట‌ర్ సృజ‌న పరిశీలించారు. 

Similar News

News December 11, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్‌కు మెుదటి ర్యాంక్

image

జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రూపొందించిన ఈ-ఫైల్ డిస్‌పోజల్ రిపోర్ట్‌ (గత 3 నెలల)లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించింది. కలెక్టర్ బాలాజీ సారథ్యంలో సెప్టెంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 9, 2025 వరకు 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలే.. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది.

News December 10, 2025

గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

image

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.

News December 10, 2025

రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

image

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్‌ఏఎస్‌సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.