News August 11, 2025
విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం: కలెక్టర్

విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం పాల్వంచ బొల్లారిగూడెం మైనారిటీ పాఠశాలలో ఆయన ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి నులిపురుగుల మందుల పంపిణీలో పాల్గొన్నారు. నులిపురుగులను పూర్తిగా నిర్మూలించడంలో ఆల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
Similar News
News March 10, 2026
SVU : కాన్వకేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 63-68 వార్షిక కాన్వకేషన్ దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ప్రకటనలో పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలోపు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్ డీ పూర్తిచేసిన అభ్యర్థులు మార్చి 23వ తేదీ కాన్వకేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News March 10, 2026
ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.
News March 10, 2026
పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నిరూపిస్తూ పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతమైంది. లింగపుట్టు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి పాపిల్లరీ కార్సినోమా థైరాయిడ్గా నిర్ధారణ కావడంతో వైద్యులు టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.


