News November 7, 2025
‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి’

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక తరపున ఏర్పాటు చేసిన చెకుముకి టాలెంట్ టెస్ట్ ను అర్బన్ మండల విద్యాధికారి బానాల సదానందంతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 37 సంవత్సరాలుగా సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 17, 2026
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News January 17, 2026
బెంగాల్లో మార్పు కావాలి.. బీజేపీ రావాలి: మోదీ

TMC అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలనే విషయం బయటపడిందని PM మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని, కేంద్ర సాయం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం BJP ప్రభుత్వం రావాలన్నారు. బిహార్లో NDA గెలుపు తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మాల్డా సభలో అన్నారు. ‘మార్పు కావాలి.. బీజేపీ రావాలి’ అని PM కొత్త నినాదమిచ్చారు.
News January 17, 2026
అన్నమయ్య: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో క్రికెట్ టోర్నమెంటుకు వెళ్లాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచార ఆటగాళ్లు అతడిని వెంటనే చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.


