News February 14, 2025
విధి నిర్వహణలో ఆయుధ పరిజ్ఞానం అవసరం: సీపీ

పోలీస్ విధుల నిర్వహణలో శాంతిభద్రతల రక్షణ, సాంకేతికతతో పాటు ఆయుధ పరిజ్ఞానం అవసరమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజిలో సీపీ పాల్గొని ఫైరింగ్ విధానాన్ని పరిశీలించారు. సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, వ్యూహంగా మారి తలపడడం వంటి అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.
Similar News
News March 28, 2025
సంగారెడ్డి: వేసవిలో టీచర్ల బదిలీలు చేపట్టాలని సీఎంకు వినతి

వేసవి సెలవులో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరుతూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పులగం మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
News March 28, 2025
భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్-2025లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్షిప్లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతున్నాయి.
News March 28, 2025
జనగామలో ఓ సూపర్ మార్కెట్ కు జరిమానా

జనగామ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 26న కాలం చెల్లిన సరుకులను విక్రయించిన నేపథ్యంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన సరుకులు విక్రయించినందుకు సూపర్ మార్కెట్కు రూ.10వేలు జరిమానా విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.