News May 25, 2024
వినుకొండ: గుండెపోటుతో వీఆర్వో మృతి

గుండె పోటుకు గురై VRO మృతి చెందిన ఘటన వినుకొండ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న యేసు రత్నం, స్వగ్రామమైన పానకాలపాలెంలో శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యేసు రత్నంకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News February 9, 2025
గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.
News February 9, 2025
నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు.
News February 9, 2025
ప్రయాగరాజ్కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు

ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.