News October 8, 2025
విశాఖలో వరల్డ్ కప్.. టికెట్ ధర రూ.100 మాత్రమే

విశాఖ వేదికగా జరిగే ఉమెన్స్ వరల్డ్కప్ మ్యాచ్లను రూ.100 చెల్లించి చూసేందుకు ACA అవకాశం కల్పించింది. ఈనెల 12న జరిగే ఇండియా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ (రూ.150) మినహా మిగిలిన 4మ్యాచ్లకు టికెట్ ధర రూ.100 మాత్రమే.
➤ అక్టోబర్ 9: ఇండియా Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 12: ఇండియా Vs ఆస్ట్రేలియా
➤ అక్టోబర్ 13: బంగ్లాదేశ్ Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 16: ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
➤ అక్టోబర్ 26: ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్
Similar News
News January 18, 2026
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామాగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మారారని మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నేతగా ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు.
News January 18, 2026
నా జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకం: CM

మేడారం వేదికగా సమ్మక్క – సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని సీఎం పేర్కొన్నారు.
News January 18, 2026
‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్ వెల్లడించింది.


