News March 31, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు కమిటీ

image

విశాఖలో చైతన్య పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని బలవన్మరణంపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సంఘటనపై విచారణ జరిపి 24 గంటలలోగా నివేదిక అందించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ రాజ్యలక్ష్మి విచారణ చేయనున్నారు.

Similar News

News February 18, 2026

మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

image

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

News February 18, 2026

విశాఖలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

image

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నేవల్ ఎయిర్ స్టేషన్ (INS డేగా) వద్ద గవర్నర్ S.అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్, సీపీలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News February 18, 2026

రేపు విశాఖలో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.