News August 21, 2025
విశాఖ: ఆన్లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ఆల్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
Similar News
News January 19, 2026
విశాఖ మీదుగా కొత్త ‘అమృత్ భారత్’ రైళ్లు

విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రెండు కొత్త వీక్లీ ‘అమృత్ భారత్’ రైళ్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. (20604/20603) నాగర్కోయిల్ – న్యూ జల్పాయిగురి నాగర్కోయిల్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ట్రైన్ (20610/20609) తిరుచిరాపల్లి -న్యూ జల్పాయిగురి – తిరుచిరాపల్లి జనవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. ఈ రైళ్లు దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
News January 19, 2026
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 57 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 19, 2026
విశాఖలో రెవెన్యూ క్లినిక్కు 63 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్కు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై రెవెన్యూ క్లినిక్కు 63, సాధారణ పీజీఆర్ఎస్కు 109 వినతులు అందాయి. అందులో జీవీఎంసీవి 48, పోలీస్ శాఖవి 7, ఇతర శాఖలకు చెందినవి 54 ఉన్నాయి. కలెక్టర్తో పాటు జేసీ విద్యాధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


