News March 31, 2024
విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
Similar News
News February 18, 2026
మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
News February 18, 2026
విశాఖలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నేవల్ ఎయిర్ స్టేషన్ (INS డేగా) వద్ద గవర్నర్ S.అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్, సీపీలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
News February 18, 2026
రేపు విశాఖలో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.


