News April 4, 2024
విశాఖ: దళితుని శిరోముండనం కేసులో వాదనలు పూర్తి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళితుని శిరోముండనం కేసులో తుది వాదనలు బుధవారంతో పూర్తయ్యాయి. ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇతర నిందితులు విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధిక న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున కె.వి రామమూర్తి వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు ఇవ్వడానికి న్యాయమూర్తి శ్రీధర్ ఈ కేసును ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.1996 డిసెంబర్ 29న ఈ సంఘటన జరిగింది.
Similar News
News February 18, 2026
విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
News February 18, 2026
విశాఖలో అట్టహాసంగా ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖపట్నం తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 71 యుద్ధనౌకల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. ‘సముద్రాల ద్వారా ఐక్యత’ (United Through Oceans) అనే థీమ్తో జరిగిన ఈ వేడుక దేశాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని, వివిధ దేశాల నావికుల కలయిక ప్రపంచ ఐక్యతకు నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు.
News February 18, 2026
విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.


