News March 27, 2024

విశాఖ: ధోనీ క్రేజ్.. ఓపెన్ అయిన గంటలోనే..!

image

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News February 13, 2026

విశాఖలో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు.. పటిష్ఠ భద్రత

image

ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల కోసం విశాఖలో 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్రపతి, 75 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ మహా వేడుక కోసం 64 డ్రోన్లు, ఆధునిక యాప్‌లతో నిఘా పెంచారు. తీర భద్రతను కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని 112 తెలియజేయాలని కోరారు.

News February 13, 2026

విశాఖ: ముడి సరుకు కొరత.. ప్లాంట్‌లో తగ్గిన ఉత్పత్తి

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో వారం రోజులుగా హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది. రోజుకు 19 వేల టన్నుల లక్ష్యానికి బదులుగా 16,730 టన్నులకు పరిమితమైంది. కోక్ కొరత, పాత కోక్ ఓవెన్ బ్యాటరీల సామర్థ్యం తగ్గడం ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. సరిపడా ముడి పదార్థాలు అందకపోవడంతో అధిక ధరకు కోక్ కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఉత్పత్తి లక్ష్యం తగ్గిందంటూ జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

News February 12, 2026

విశాఖ: 18 ఏళ్లుగా తప్పించుకుంటున్న నిందితుడి అరెస్ట్

image

18 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్ రెహనుల్లా సిద్ధిఖీని విశాఖ 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 నుంచి పరారీలో ఉన్న ఇతనిని గాండీవ యాప్, పాన్ (PAN) వివరాల ఆధారంగా చెన్నైలో గుర్తించారు. నిందితుడిపై హత్యతోపాటు పలు కేసులు ఉన్నాయి. ఎస్సై బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.