News May 23, 2024

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు

image

విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలును ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. అదే విధంగా, గుణుపూరు నుంచి విశాఖకు వచ్చే పాసింజర్ ట్రైన్ ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-పలాస మధ్య నడిచే పాసింజర్ ట్రైన్‌ను ఈ నెల 27న రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 9, 2026

విశాఖ: విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 8, 2026

విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

image

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.

News March 8, 2026

BREAKING: విశాఖలో ఐటీ దాడుల కలకలం

image

విశాఖలోని మధురవాడ, అక్కయ్యపాలెం సహా నాలుగు ప్రాంతాల్లోని ‘సెలబ్రేషన్స్ హోటల్’ శాఖలపై ఆదివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. జీఎస్టీ రిటర్న్స్‌లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కంప్యూటర్ డేటా, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇతర హోటల్ యజమానులు తమ రికార్డులను సరిచూసుకుంటున్నారు.