News March 27, 2024
విశాఖ: ‘ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షల్లో అప్పు’

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై లక్షల్లో అప్పు ఉందని ప్రజాశాంతి పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖ రైల్వే న్యూ కాలనీ వద్దగల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… తాను ఎంపీగా పోటీ చేద్దామని బీజేపీలో చేరితే మోసం చేశారని అన్నారు. అందుకే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా కేఏ పాల్ను గెలిపించాలన్నారు.
Similar News
News February 14, 2026
విశాఖ చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.
News February 14, 2026
విశాఖ: కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు

విశాఖలో 17 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్ల నిర్వహణలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు నగర ప్రజలు గమనించాలని సూచించారు.
News February 13, 2026
ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

విశాఖలో జరగనున్న ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి పదో తరగతి, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధించాలన్నారు.


