News May 13, 2024

విశాఖ: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరకు, పాడేరులో పోలింగ్ ముగియగా.. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
> SHARE IT

Similar News

News December 17, 2025

బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

image

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.