News April 26, 2024
విశాఖ: వివాహిత అనుమానాస్పద మృతి

బుచ్చియ్యపేట మండలం పొట్టి దొరపాలెంలో రామాల అన్నపూర్ణ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు బి.రమణ ఫిర్యాదు మేరకు ఎస్సై డి ఈశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టానికి తరలించారు. అన్నపూర్ణకి తన భర్త సత్తిబాబుతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు. భర్తను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 18, 2026
సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News April 18, 2026
ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.
News April 18, 2026
ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.


