News April 28, 2024

విశాఖ: 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు

image

విశాఖ జిల్లాలో ఎన్నికలకు 15 వేలమంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. జిల్లాలో 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడు విభాగాల్లో 110 బృందాలను నియమించామని చెప్పారు. మైక్రో అబ్జర్వర్, వీడియో గ్రాఫర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. కంట్రోల్ రూములను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

Similar News

News April 18, 2026

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

image

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 18, 2026

ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

image

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.

News April 18, 2026

ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

image

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.