News August 22, 2025
విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం DMHO

సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కళావతి బాయి సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Similar News
News January 21, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: ఈసీ

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర EC కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ మినహా 5 మున్సిపాలిటీల్లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
News January 21, 2026
ఖమ్మం: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరాం(45)అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ ఏకగ్రీవంగా బోటితండా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. తులసీరామ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
News January 21, 2026
ఖమ్మం ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం

సంక్రాంతి సందర్భంగా ఖమ్మం రీజియన్లో రికార్డు స్థాయిలో రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ఏడు డిపోల పరిధిలో 1,483 అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చేరవేశామని, అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆర్టీసీ యంత్రాంగం పేర్కొంది.


