News April 5, 2024

వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్: జగన్

image

తిరుపతి జిల్లాలో నిన్న CM జగన్ బస్సు యాత్ర జరిగింది. రేణిగుంట నుంచి ఆయన యాత్ర ప్రాంభం కాగా దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలిశారు. కూలీలు, వృద్ధులతో మాట్లాడారు. ఆయనతో పలువురు సెల్ఫీ దిగారు. ‘వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్’ అంటూ సంబంధిత ఫోటోలను జగన్ ట్విటర్(X)లో పోస్ట్ చేశారు. నిన్నటి కార్యక్రమంలో CM వెంట తిరుపతి MP గురుమూర్తి, శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News January 17, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

image

కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పారదర్శకంగా, పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దళారులను మధ్యవర్తులను నమ్మకుండా, మోసపోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా తాము భర్తీకి సహకరిస్తాము అని చెబితే డయల్ 112కు గాని చిత్తూరు పోలీసు వాట్సప్ నం. 9440900005కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.

News January 16, 2025

చిత్తూరు: రేపటి నుంచి కానిస్టేబుళ్లకు పరీక్షలు

image

స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (సివిల్, ఎ.పి.ఎస్.పి) దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 17, 18వ తేదీలలో జరగనున్నాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. 8, 9 తేదీలలో జరగాల్సిన పరీక్షలు వైకుంఠ ఏకాదశి కారణంగా వాయిదా పడ్డాయన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

News January 16, 2025

తిరుమలలో విషాదం.. బాలుడి మృతి

image

తిరుమల వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డ ఓ బాలుడు మృతిచెందాడు. కడప టౌన్ చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీనివాస రాజు, సాత్విక్(3) అనే ఇద్దరు కుమారులతో కలిసి తిరుమలకు వచ్చారు. సాయంత్రం అన్నతో ఆడుకుంటూ సాత్విక్ కిందపడగా.. తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.