News September 13, 2025

వెంకటాపూర్: 34 అడుగులకు చేరువలో రామప్ప నీటిమట్టం

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు నీటిమట్టం 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు చేరుతుంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా.. 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. దీంతో రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

వనపర్తి: ఊర్లో ఎన్నిక.. సిటీలో ప్రచారం

image

నగరంలో బతుకుదెరువు, పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి ఆయా వర్గాల ప్రజలు వచ్చి జీవిస్తుంటారు. ఈనెల14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి మండలం పెద్ద తండా(డి) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాత్లావత్ రాజ్యా నాయక్ బోయినపల్లి, బాపూజీ‌నగర్, హస్మత్‌పేట, సెంటర్ పాయింట్ ఏరియాలలో ఓటర్లను కలిసి అభ్యర్థించారు.

News December 9, 2025

పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

image

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్‌కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 9, 2025

మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్: గల్లా జయదేవ్

image

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.