News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

Similar News

News March 11, 2026

వేట్లపాలెం ఘటనపై సీఎం సీరియస్..!

image

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ, బాణసంచా కేంద్రాలపై కఠిన నిఘా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.

News March 11, 2026

పాలమూరు: భానుడి ప్రతాపం.. అడుగంటుతోన్న భూగర్భ జలాలు!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి ఆరంభంలోనే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేసవి ప్రారంభంలోనే జలవనరులు అడుగంటడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని, నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

News March 11, 2026

సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

image

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.