News May 7, 2025

వేసవి రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

వేసవి రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం VSKP- CHZ(నం.08579), ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు ప్రతి శనివారం CHZ-VSKP(నం.08580) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, కైకలూరు, గుడివాడలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News February 13, 2026

మేడ్చల్: 3 రంగుల జెండాను నిలబెట్టిన ముగ్గురు ‘లత’లు!

image

మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉద్దమర్రి వార్డులకు చెందిన రాజీగళ్ల లత, పెద్దిరెడ్డి లత, దోసకాయల లత కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకే పేరుతో బరిలోకి దిగిన ఈ ముగ్గురు హస్తం గుర్తు మీద విజయం సాధించారు. ఎంసీపల్లిలో కారు స్పీడ్‌కు ఈ ముగ్గురు బ్రేకులేయడం చర్చనీయాంశమైంది. ఒకే పేరుతో ముగ్గురు కౌన్సిలర్లు కొలువుదీరడం గ్రామంలోనే కాదు మున్సిపాలిటీ అంతటా ఆసక్తిగా మారింది.

News February 13, 2026

మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

image

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్‌లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.

News February 13, 2026

క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న

image

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు‌.