News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

Similar News

News February 16, 2026

చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్

image

AP: తాను కలిసిన ప్రపంచ నేతలతో పోలిస్తే చంద్రబాబువి విజనరీ ఆలోచనలని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ‘ఈ విషయాన్ని CBNతో జరిగిన తొలి భేటీలోనే గ్రహించాను. ఆయన ITని ప్రమోట్ చేయడం వల్లే HYD నుంచి నిపుణులు తయారయ్యారు. డిజిటల్ విప్లవంలో మోదీ, CBN కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయడానికి AI తోడ్పడుతుంది. వ్యవసాయంలో Ai వాడుక మంచి పరిణామం’ అని సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు.

News February 16, 2026

TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

image

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

News February 16, 2026

హోలీ పండుగ స్పెషల్.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ విడుదల

image

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా భారత రైల్వే మార్చి నెలలో విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లికి మార్చి 6 నుంచి 27 వరకు (శుక్రవారాలు), బెంగళూరుకు మార్చి 1 నుంచి 29 వరకు (ఆదివారాలు), తిరుపతికి మార్చి 2 నుంచి 30 వరకు (సోమవారాలు) ఈ రైళ్లు నడుస్తాయి. అలాగే షాలిమార్, సంబల్పూర్, భువనేశ్వర్ మార్గాల్లోనూ మార్చి నెల అంతా వారపు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.