News April 11, 2024

వైసీపీలోకి కోట్ల హరి చక్రపాణి రెడ్డి..?

image

దేవనకొండ మాజీ జడ్పీటీసీ సభ్యులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత నెలకొంది. 12న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కోట్ల హరికి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

Similar News

News March 16, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు

image

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరులో కిలో స్కిన్ రూ.160, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. ఆదోనిలో స్కిన్ లెస్ రూ.185, స్కిన్ రూ.160కి విక్రయాలు జరిగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇవే రేట్లు పలుకుతున్నాయి.

News March 16, 2025

పది విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

image

ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ వెల్లడించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి, 14 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కల్పించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 16, 2025

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దాం: స్పెషల్ ఆఫీసర్

image

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌ఛార్జ్ ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

error: Content is protected !!