News December 2, 2025
శబరి వెళ్లిన ప్రతి ఒక్కరూ 18 మెట్లు ఎక్కవచ్చా?

శబరిమలలో 18 పవిత్ర మెట్లను ముక్తికి సోపానాలుగా భావిస్తారు. ఇవి మనలోని 18 పాపపుణ్యాలు, విద్య, ఇంద్రియాలను సూచిస్తాయని నమ్మకం. వీటిని మండల కాల దీక్షా వ్రతం పూర్తిచేసినవారు మాత్రమే ఇరుముడి ధరించి, ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అధిరోహిస్తారు. దీక్ష ధరించకుండా, ఇరుముడి లేకుండా వచ్చిన భక్తులు ఈ మెట్లకు ప్రక్కన ఉన్న సాధారణ మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. <<-se>>#AyyappaMala<<>>
Similar News
News February 18, 2026
‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News February 18, 2026
ఏపీలో క్రికెట్ ఆడే వారికి గుడ్న్యూస్!

క్రికెట్ బాగా ఆడే యువతకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రోగ్రామ్ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 5న దీనిని లాంచ్ చేసే అవకాశముంది. 19 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు ప్రిఫరెన్స్ ఉంటుందని, 19+ వారిని నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 88 నియోజకవర్గాల్లో ఒక్కో దాని నుంచి 20-50 మందికి అవకాశం కల్పించనున్నట్లు ACA వర్గాలు చెబుతున్నాయి.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<


