News September 11, 2025
శిథిలావస్థ గదుల్లో తరగతులు నిర్వహించవద్దు: డీఈఓ

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
Similar News
News December 9, 2025
హీరో రాజశేఖర్కు గాయాలు

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్లో పాల్గొంటారని చెప్పాయి.
News December 9, 2025
మద్యం షాపులు బంద్: జనగామ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా శాంతి భద్రతల కోసం మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మూడు ఫేజ్ల్లో మండలాల వారీగా మూసివేత అమలు కానుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News December 9, 2025
భద్రాద్రి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి జైలు శిక్ష!

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వేరొక యువతిని వివాహం చేసుకున్న కేసులో నిందితుడు పొట్ట కృష్ణార్జున రావుకు దమ్మపేట జ్యుడీషియల్ కోర్టు రెండున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్ఐ యాయతి రాజు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేట మం. బండారిగుంపు గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు మేరకు 2017లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ అనంతరం మెజిస్ట్రేట్ భవాని రాణి తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.


