News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన అధికారి దిగంబర్ పి ప్రధాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖ పరమైన పలు అంశాలపై చర్చించారు.

Similar News

News April 12, 2026

హిరమండలంలో జరిగిన దొంగతనంలో ట్విస్ట్

image

హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో <<19625168>>బిగ్ ట్విస్ట్<<>> నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో కొత్తూరు CI ప్రసాదరావు, SI మధుసూదనరావు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 12, 2026

రణస్థలం: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించిన యువకులు

image

రణస్థలం మండల పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. దీంతో వీరికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 12, 2026

రణస్థలం: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించిన యువకులు

image

రణస్థలం మండల పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. దీంతో వీరికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.