News March 8, 2025
శ్రీకాకుళం: కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలి

అపరిష్కృతంగా ఉన్న అదృశ్య (మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తులో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జామ్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ గా డీఎస్పీ, సీఐ, ఎస్సైలు హాజరయ్యారు. మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులు దర్యాప్తు, విచారణ, హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తు గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 27, 2025
పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 27, 2025
టెక్కలి: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(62) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగులమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య భానమ్మ ఉన్నారు.
News March 27, 2025
శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC), యశ్వంత్పూర్(YPR) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC- YPR(నెం.02863), ఏప్రిల్ 5 -26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడపనున్నారు. ఈ రైళ్లు ఏపీలోని శ్రీకాకుళం, పలాస, విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి.