News April 22, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.

Similar News

News December 16, 2025

శ్రీకాకుళం జిల్లా నుంచి నియామక పత్రాలు ఎంతమంది అందుకున్నారంటే.!

image

శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను CM చంద్రబాబు నేడు మంగళగిరిలో అందించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 373 మంది ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో..
☛ సివిల్ కానిస్టేబుల్స్ మెన్-129
☛ కానిస్టేబుల్ ఉమెన్- 20
☛ APSP- 224 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.

News December 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

image

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.

News December 16, 2025

శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

image

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.