News January 2, 2025

శ్రీకాకుళం జిల్లాలో 2,621 కేసుల బీర్లు తాగేశారు

image

శ్రీకాకుళం జిల్లాలో న్యూఇయర్ రోజున రూ.5.46 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 6,984 కేసులు ఐఎంఎల్(వైన్) విక్రయాలు జరిగాయి. 2621 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు పెరిగాయి. నాడు 5,597 కేసుల ఐఎంఎల్ మద్యం, 2,329 కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.5,12,21,367 ఆదాయం వచ్చింది.

Similar News

News January 21, 2025

శ్రీకాకుళం: ఈ నెల 24న సుకన్య సమృద్ధి యోజన డ్రైవ్

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్నిపోస్ట్ ఆఫీస్‌లలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తేదీన సుకన్య సమృద్ధియోజన మెగా మేళా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. 10 సంవత్సరాలోపు బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. ఒక సం.లో కనీసం 250/- గరిష్ఠంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18సం. నిండిన తర్వాత విద్య, వివాహం నిమిత్తం 50% వరకు నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.

News January 21, 2025

SKLM: కార్తీక్ మృతిపై మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి

image

చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి పట్ల టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జమ్మూలో నిన్న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సైనికుడు కార్తీక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News January 21, 2025

రామకృష్ణాపురం: అనుమానాస్పదంగా జేసీబీ ఓనర్ మృతి

image

పలాస మండలం రామకృష్ణాపురం పవర్ గ్రిడ్ ప్రాంతాల్లో నీలావతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీరావు(50) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆయనకు జేసీబీ ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.