News August 9, 2024
శ్రీకాకుళం: జిల్లా BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా BSNL 4జీ దశలవారీగా ప్రవేశ పెడుతున్నట్లు వినియోగదారులు 2జీ, 3జీ సిమ్ కార్డులను తక్షణమే 4జీకి అప్గ్రేడ్ చేసుకోవాలని BSNL శ్రీకాకుళం జిల్లా జనరల్ మేనేజర్ నాయుడు మర్రి గురువారం తెలిపారు. జిల్లాలో 229 టవర్లకు ఇప్పటికే 50 టవర్లను 4జీ టవర్లుగా మార్పు చేశామని తెలిపారు. కస్టమర్లు కేవైసీని దగ్గర్లో ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉచితంగా అప్గ్రేడ్ చూసుకోవచ్చున్నారు.
Similar News
News December 6, 2025
SKLM: వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదు

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సుమారుగా 7 నెలలు కావస్తున్నా వేతనాలు చెల్లించడం లేదన్నారు.
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
శ్రీకాకుళం: టెట్ ఎగ్జామ్ సెంటర్లు ఇవే

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10-21 వరకు జరగనుంది. జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
✦ఎగ్జామ్కు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన కేంద్రాలు ఇవే:
➤ నరసన్నపేట-కోర్ టెక్నాలజీ
➤ఎచ్చెర్ల-శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల


