News March 3, 2025

శ్రీకాకుళం : ప్రయాణికులకు అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయ్..!

image

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్(BBSR)- పుదుచ్చేరి(PDY) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు(వీక్లి) ప్రస్తుత నంబర్లు 12898/12897 స్థానంలో 20851/20852 నంబర్లు ఉంటాయన్నారు. BBSR- PDY రైలు ఈ నెల 4 నుంచి, PDY- BBSR రైలు ఈ నెల 5 నుంచి నూతన నంబర్లతో ప్రయాణిస్తాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 15, 2025

SKLM: పొట్టి శ్రీరాములు జయంతికి కలెక్టర్ పిలుపు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శ్రీకాకుళం పాత బస్ స్టాండ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు హాజరై నివాళులర్పించాలని కలెక్టర్ కోరారు.

News March 15, 2025

SKLM: ఈ నెల 16 నుండి 17 వరకు ఎపిపిఎస్సీ పరీక్షలు

image

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు ఈ నెల 16 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.

News March 15, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు. 

error: Content is protected !!