News May 23, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

Similar News

News March 7, 2026

సంతబొమ్మాళి: ‘మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’

image

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరువాడ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు మంత్రి అచ్చెన్న నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయనకు కలిసి వినతి పత్రం అందజేశారు. సాగర్ మాల ప్రాజెక్టు కింద మత్స్యకార గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం, శాశ్వత తుఫాన్ రక్షిత భవనం నిర్మాణ చేయాలని కోరారు.

News March 6, 2026

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కాశీబుగ్గ: గంజాయితో ముగ్గురు అరెస్ట్
➤శ్రీకాకుళం: వైసీపీ నియోజకవర్గ పరీశీలకుల నియామకం
➤ కొండములగాం సీహెచ్సీలో నాగుపాము హల్‌చల్
➤మందస: ఎవరు వస్తారు..దారి మనదే బాగుచేసుకోవాల్సిందే!
➤శ్రీకాకుళం జిల్లాలో “పది” పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
➤నందిగాం మండల కేంద్రంలో లేగదూడల ప్రదర్శన
➤పలాస: ‘ప్రభుత్వ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి’
➤ పోలాకి తీర గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటు

News March 6, 2026

జడ్పీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకే!

image

ఏపీలోని 2021లో జిల్లాల పునర్విభజన జరగక మొత్తం 13 జిల్లాలోని మండలాలకు జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2022లో 26 జిల్లాలుగా YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ఇటీవల 26ను..28 జిల్లాలుగా మార్చింది. గతంలో పాత జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళంలోని పది నియోజకవర్గాల్లో జరిగాయి. ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు జడ్పీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.