News August 25, 2024
శ్రీకృష్ణదేవరాయ, బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్ల అభివృద్ధికి నిధులు

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.15.4 కోట్ల నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని, నగర వనాలపై దృష్టి సారించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Similar News
News January 20, 2026
జేఎన్టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News January 20, 2026
అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్ఛార్జ్ కలెక్టర్తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
News January 19, 2026
122 అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 122 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


