News February 27, 2025

శ్రీశైలంలో నేడు రథోత్సవం, తెప్పోత్సవం

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీశైలంలో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు రథాంగదేవతా పూజ, రథాంగదేవతా హోమం, రథాంగ దేవతా బలిసమర్పణ, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు సాయంకాలార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు, రాత్రి 8 గంటలకుతెప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Similar News

News February 27, 2025

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ కూడా పడకముందే వర్షం ఆరంభమైంది. ఎంతకీ వాన తగ్గకపోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఈ టోర్నీలో పాక్, బంగ్లా జట్లు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడాయి. దీంతో ఇరు జట్లు ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

News February 27, 2025

ముగిసిన వంశీ కస్టడీ

image

AP: వైసీసీ నేత వల్లభనేని వంశీ మూడోరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

News February 27, 2025

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

image

ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉ.8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.

error: Content is protected !!