News June 18, 2024
శ్రీశైలం: మల్లన్నకు వెండి రథోత్సవ సేవ

శ్రీశైల దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవ నిర్వహించారు. కాగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథోత్సవంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రదక్షిణ గావించారు. వెండి రథోత్సవంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News January 24, 2026
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News January 24, 2026
ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి: జిల్లా కలెక్టర్

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సరి సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ‘జీరో- గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ అనే థీమ్తో ర్యాలీనీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్కలను నాటారు.
News January 24, 2026
వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


