News March 13, 2025
శ్రీసత్యసాయి: విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదన్నారు.
Similar News
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.
News February 19, 2026
SRD: ఉపవాసాలు.. ఆధ్యాత్మిక సందేశాలు

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం గురువారం నుంచి ఆరంభం కానుంది. క్రమశిక్షణ దాతృత్వం. ధార్మిక చింతనలే కలయిక రంజాన్ మాసం 30 రోజుల పాటు కటిన ఉపవాస దీక్షలతో ఆరంభించి దీక్ష ముగిస్తారు నెలపొడుపు దర్శనం.చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం నుంచి పండుగను జరుపుకుంటారు. వేడుక కోసం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మసీదులను అందంగా ముస్తాబు చేశారు.


