News August 13, 2025
శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

బెంగళూరుకు చెందిన భక్తుడు కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం అందించారు. బుధవారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన క్యాంపు కార్యాలయంలో విరాళం చెక్కును భక్తుడు స్వయంగా అందజేశారు. దాతకు టీటీడీ అదనపు ఈవో అభినందనలు తెలిపారు.
Similar News
News March 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.
News March 14, 2026
OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్కు బ్రేక్ వేశారు.
News March 14, 2026
కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ కేటాయించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య చేసిన వినతికి కేంద్రం స్పందించింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు లేఖ ద్వారా రేక్స్ సమృద్ధిగా కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర అవసరాలు, బోగీల లభ్యత ఆధారంగా ధాన్యం రవాణా కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం రైల్వే ద్వారా రవాణా కానుందన్నారు.


