News May 14, 2024

శ్రీ సత్యసాయి: అర్ధరాత్రి ఇరువర్గాల దాడి.. టీడీపీ కార్యకర్త మృతి

image

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనమలపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందాడు. ఎరికల గురుమూర్తి అనే టీడీపీ కార్యకర్తపై సమీప బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గురుమూర్తిని చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీతో కలిసి నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News December 4, 2025

అనంతపురం జేఎన్టీయూలో శిక్షణా తరగతులు

image

అనంతపురం జేఎన్టీయూలో RTIH ఆధ్వర్యంలో స్పార్క్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.సుదర్శన్ రావు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. స్పార్క్ కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ యువతలో సృజనాత్మక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. స్టార్టప్ రంగంలో వీరికి మార్గదర్శక అందించడంలో ఈ వేదిక కీలక భూమిక పోషిస్తుందన్నారు.

News December 4, 2025

అనంతపురం జేఎన్టీయూలో శిక్షణా తరగతులు

image

అనంతపురం జేఎన్టీయూలో RTIH ఆధ్వర్యంలో స్పార్క్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.సుదర్శన్ రావు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. స్పార్క్ కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ యువతలో సృజనాత్మక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. స్టార్టప్ రంగంలో వీరికి మార్గదర్శక అందించడంలో ఈ వేదిక కీలక భూమిక పోషిస్తుందన్నారు.