News November 7, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఏఎస్పీగా అంకిత మహవీర్

image

పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా అంకిత సురానా మహవీర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని, మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఏఎస్పీ ఎస్పీ పేర్కొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

Similar News

News January 13, 2026

జపాన్‌కు ఎంపికైన మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థి

image

రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన పరశురాం ‘సకుర సైన్స్ టాలెంట్’ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి జపాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న ఇతడు, వారం రోజుల పాటు జపాన్‌లోని అధునాతన సాంకేతికతను పరిశీలించి, శాస్త్రవేత్తలతో భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందం పరశురాంను ఘనంగా సన్మానించారు.

News January 13, 2026

పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.

News January 13, 2026

భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

image

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.