News March 14, 2025
సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్గా సమర్పించాలని తెలిపారు.
Similar News
News February 13, 2026
ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. ఇది మర్చిపోవద్దు!

భారతీయ రైల్వే 45 పైసలకే ₹10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తోందని తెలుసా? ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సర్వీసును అందిస్తోంది. ప్రమాదంలో మరణించినా/శాశ్వత వైకల్యం ఏర్పడినా ₹10 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹7.5 లక్షలు, గాయపడితే ₹2 లక్షలు అందిస్తుంది. మృతదేహం తరలింపుకు ₹10 వేలు ఇస్తుంది. బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ కోసం నామినీ వివరాలు ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.
News February 13, 2026
BREAKING: చౌటుప్పల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 13 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 3 బీజేపీ, 1 సీపీఎం గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
రామగుండం: ‘రెండు’ ఓట్ల తేడాతో ఘన విజయం!

రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్లో ఉత్కంఠ పోరు ముగిసింది. ఏఐఎఫ్బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. పోటాపోటీగా సాగిన ఈ పోరులో రీకౌంటింగ్ నిర్వహించగా, చివరకు తిరుపతిని విజయం వరించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.


