News November 7, 2025

సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.

Similar News

News January 23, 2026

తిరుపతి: వెల్లువెత్తిన అర్జీలు

image

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని బాధితుల నుంచి సుమారు 500కు పైగా అర్జీలను స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ వివాదాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.

News January 23, 2026

VHP నేతపై దాడి.. ఉజ్జయినిలో చెలరేగిన హింస

image

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హింస చెలరేగింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకుడిపై దాడి జరిగిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగినట్టు తెలుస్తోంది. పలు బస్సులకు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఇళ్లపై రాళ్లతో దాడి చేశాయి. దీంతో ఉజ్జయినిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.

News January 23, 2026

VZM: 27న జాబ్ మేళా.. నెలకు రూ.30,000 వరకు జీతం

image

విజయనగరంలోని మహారాజా కళాశాల ఆవరణలో ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నాలుగు సంస్థల ద్వారా 595 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతీ, యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,765 నుంచి రూ.30,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in, ncs.gov.inలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు.