News September 12, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతినిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 19 మంది ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

గద్వాలలో 86.77శాతం పోలింగ్ నమోదు

image

గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. నాలుగు మండలాల్లోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లు చెప్పారు.

News December 11, 2025

పల్నాడు DEOగా రామారావు బాధ్యతలు

image

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా పి.వి.జె. రామారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల లోటు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ DEOకు సూచించారు.

News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.