News September 9, 2025

సంగారెడ్డి: జిల్లా ఆసుపత్రిలో పర్యటించిన మంత్రి

image

మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో రూ.273.40 కోట్లతో కొత్తగా 500 పడకల నూతన భవనాన్ని నిర్మించేందుకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు, వైద్య శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి దిశానిర్దేశం చేశారు.

Similar News

News December 6, 2025

NRPT: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అప్పంపల్లిలో నవంబర్ 18న ఇంటి నుంచి<<18355152>> అదృశ్యమైన గోవర్ధన్ రెడ్డి<<>> <<18480571>>మృతదేహం శుక్రవారం లభ్యమైంది.<<>> ఆర్థిక సమస్యలు, మతిస్థిమితం లేమి కారణంగా ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓ బావి పక్కన ఉన్న పొదల్లో ఆయన శవం లభ్యం కాగా, కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 6, 2025

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పేరం స్వర్ణలత

image

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 మందిని ప్రకటించగా.. అందులో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పేరం స్వర్ణవ్రతం ఉన్నారు. స్వర్ణలత ఇప్పటికే వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

News December 6, 2025

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.