News April 10, 2025
సంగారెడ్డి: పిడుగుపాటుకు విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జరిగింది. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సంతోశ్ కళాశాలకు వెళ్లొస్తుండగా భారీ వర్షం పడటంతో చెట్టుకిందకి వెళ్లాడు. దీంతో చెట్టుపై పిడుగు పడటంతో సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 22, 2026
మార్చి 29న సూపర్ వైజర్ పోస్టులకు రాత పరీక్ష

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి మార్చి 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు TSLPRB ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియగా, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అభ్యర్థులు అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను చూడాలని సూచించారు.
News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్ల్యాండ్కు సంబంధించిన గోల్డెన్ డోమ్పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్ను సీఎం రేవంత్ దావోస్లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్ను అధ్యయనం చేస్తామని తెలిపారు.


