News August 11, 2025
సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వెంటనే సంబంధిత సీఐలు, ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న నేరుగా సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.
Similar News
News March 15, 2026
భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు: కలెక్టర్

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక (2025-26) కింద జిల్లాకు 190 బ్యాంకు సంబంధిత యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రూ.382 లక్షలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 15, 2026
హిందూపురంలో నేడు జాబ్ మేళా

హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.
News March 15, 2026
అనకాపల్లి: QR కోడ్ స్కాన్ చేసి సెంటర్ వివరాలు తెలుసుకోండి..

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్స్పై ప్రత్యేకంగా క్యూర్ కోడ్ ముద్రించారు. ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే విద్యార్థుల పరీక్ష కేంద్రానికి వెళ్లే దారితో పాటు వివరాలు తెలుస్తాయని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సుకుమార్ తెలిపారు. దీనివల్ల పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.


